👉Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ...
👉తూర్పుగోదావరి జిల్లా నన్నయ
విశ్వవిద్యాలయంలో అక్టోబరు 16న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె. హేమచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...
👉 ఆంధ్రప్రదేశ్ లోని 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేస్తారని వెల్లడించారు.
👉వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్పై తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
👉అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ అధ్యాపకులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.
👉 భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో అధ్యాపకుడు అకడమిక్ సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
👉బోధనేతర సిబ్బంది:
బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న రేషనలైజేషన్ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్తో కమిటీని నియమించామని చెప్పారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: