👉 రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కనే నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు అర్హులవుతారు.
👉దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ 7 నుంచి మే 6, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrcjaipur.in లేదా nwr.indianrailways.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
👉 మొత్తం ఖాళీలు 238 ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీకి 120, ఓబీసీకి 36, ఎస్టీకి 18, ఎస్సీకి 36 పోస్టులు రిజర్వు చేశారు.
👉అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
👉దీనితో పాటు అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్ లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి.
👉దరఖాస్తుదారుడి వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
👉అదే సమయంలో OBC కేటగిరీకి వయోపరిమితి 45 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 47 సంవత్సరాలుగా నిర్ణయించారు.
👉 దరఖాస్తు ఫీజు:
💥అన్ని కేటగిరీల అభ్యర్థులని దరఖాస్తు రుసుము నుంచి మినహాయించారు.
👉అంటే ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
👉షార్టిస్ట్ చేసిన అభ్యర్థులని CBT పరీక్ష ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.
👉ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జాము పిలుస్తారు.
👉ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.