👉 నిర్మలా సీతారామన్ విద్యకు తమ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు.
👉 ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ను రిక్రూట్ చేయనున్నారు.
👉 రానున్న మూడేళ్లలో ఈ స్కూళ్లకు 38, 800 వేల మంది టీచర్లను, ఇత సహాయక సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
👉 అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
👉 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
👉 అలాగే గిరిజనుల పీవీటీజీ మిషను ఏర్పాటు చేయనున్నట్టు లోక్సభలో వెల్లడించారు.
👉 గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ డెవలప్మెంట్ మిషన్ను అని చెప్పారు.
👉 వచ్చే 3 సంవత్సరాలలో ఈ పథకాన్ని అమలుకు రూ.15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు.