👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏడాది ప్రారంభించనున్న మరో ఐదు కళాశాలల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్(ఎస్ఆర్) నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
👉ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎస్ఆర్ట్లను ఎంపిక చేయనున్నారు.
👉వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నారు.
👉 వీరికి రూ.70వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు.
👉మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్ను నియమించనుండగా, అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్ మెడిసిన్లో 34 ఖాళీలు ఉన్నాయి.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: