Type Here to Get Search Results !

ఏపీ లో పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు..నవంబర్ 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించాయి. కొండేపిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

👉15 మల్టీ నేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నారని తెలుస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫో కం, డి మార్ట్, ఎస్ వి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నాయి.

👉పదో తరగతి, ఇంటర్,ఐ టి ఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి అర్హత కలిగి ఉంటారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

👉https://skilluniverse.apssdc.in వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఈ నంబర్స్ ద్వారా 6281205538, 8008822821 ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

👉 ఆధార్ కార్డు జిరాక్స్, బయో డేటా ఫార్మ్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

👉9988853335 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments