Type Here to Get Search Results !

సశస్త్రసీమాబల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... రాత పరీక్ష వివరాలు...


👉సశస్త్రసీమాబల్  లోని పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 1656

👉పోస్టుల వివరాలు:
1. సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులు- 111,
2. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (పారామెడికల్)-30,
3. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్)- 40,
4. హెడాకానిస్టేబుల్ -914,
5.  కానిస్టేబుల్ పోస్టులు-543
6.  అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ) 18 పోస్టులు ఉన్నాయి.

1.సబ్ ఇన్స్పెక్టర్  పోస్టు అర్హతలు : 

▪️సబ్ ఇన్స్పెక్టర్(పయనీర్): సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

▪️వయస్సు: 30 ఏళ్ల లోపు ఉండాలి.

2. సబ్ ఇన్స్పెక్టర్(డ్రాఫ్ట్స్ మెన్): మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
▪️ రెండేళ్ల ఐటీఐ నేషనల్ ట్రేడ్స్ మెన్ సర్టిఫికేట్ ఉండాలి.
▪️ఆటోక్యాడ్లో ఏడాది సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేయాలి లేదా ఆటో క్యాడ్లో ఏడాది అనుభవం ఉండాలి.
▪️ డ్రాఫ్ట్స్ మ్యాన్షిప్ ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

👉వయస్సు :18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

3.సబ్ ఇన్స్పెక్టర్(కమ్యూనికేషన్): ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
▪️లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేయాలి.

▪️ వయస్సు : 30 సంవత్సరాలు మించకూడదు.

4. సబ్ ఇన్స్పెక్టర్(స్టాఫ్నర్స్) ఫిమేల్: సైన్స్ సబ్జెక్టుతో 10+2/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.
▪️జనరల్ నర్సింగ్ లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేయాలి.
▪️ సెంట్రల్/ స్టేట్ కౌన్సిల్ తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి.
▪️ రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

▪️ వయస్సు : 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

▪️ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు,
▪️ ఓబీసీలకు 3 ఏళ్లు,
▪️ ఎక్స్-సర్వీసెమెన్లకు 3 ఏళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 5 నుంచి 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

👉రాత పరీక్ష వివరాలు : 

▪️పీఈటీ, పీఎస్ఓ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్ష(కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు ఎంపిక చేస్తారు.
▪️దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.
▪️రాత పరీక్ష రెండు పార్ట్లుగా 150 ప్రశ్నలకు ఉంటుంది.
▪️ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
▪️పరీక్ష సమయం మూడు గంటలు.

👉పార్ట్-1: ఈ పార్ట్ లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ /జనరల్ హిందీ 50 మార్కులకు ఉంటాయి.

👉పార్ట్-2: ఈ పార్ట్ లో టెక్నికల్ సబ్జెక్టుకు 100 మార్కులుంటాయి.

👉రాత పరీక్షకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్సెసర్వీస్మెన్ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి.
▪️ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాలి.
▪️రాత పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు.

👉 ఎంపిక విధానం:
▪️ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు.
▪️పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్కు పిలుస్తారు.
▪️రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

5. హెడ్ కానిస్టేబుల్ పోస్టులు: 
▪️అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

▪️వయస్సు : హెచ్ సీ (మెకానిక్) పోస్టుకు 21-27 ఏళ్లు,
▪️మిగిలిన పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు,
▪️ఓబీసీలకు 3 ఏళ్లు,
▪️ఎక్స్-సర్వీస్ మెన్లకు 3 ఏళ్లు,
▪️ డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్,

6. పోలీస్ కానిస్టేబుల్: 
▪️అర్హతలు: డ్రైవర్ పోస్టుకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
▪️ పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి

👉వయస్సు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

👉వెటర్నరీ పోస్టుకు సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వెటర్నరీ హాస్పిటల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
▪️వయస్సు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

👉కార్పెంటర్, బ్లాక్స్మిత్, పెయింటర్ పోస్టులకు పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
▪️ రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. లేదా ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయాలి. లేదా రెండేళ్ల ఐటీఐ డిప్లొమా ఉండాలి. ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. ▪️వాషర్ మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, క్లోబర్, కుక్ అండ్ వాటర్ కేరియర్ పోస్టులకు టెన్త్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల పని అనుభవం/ఐటీఐ ఏడాది సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మల్టీస్కిల్డ్ వ్యక్తులకు ప్రాధాన్యమిస్తారుడాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

👉ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: 
▪️పీఈటీలో అర్హత సాధించిన అభ్యర్థులను పీఎసీకి ఎంపిక చేస్తారు.
▪️ఇందులోనూ అర్హత పొందిన వారికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తారు.
వ్యవధి రెండు గంటలు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/ జనరల్ హిందీ విభాగల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 18/06/2023

👉వెబ్సైట్: http://ssbrectt.gov.in/

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl



Tags

Post a Comment

0 Comments