👉దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
👉గ్రామీణ డాక్ సేవక్స్ - బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్
👉 దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు: 12,828
1. ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు: 118
2. తెలంగాణలో ఖాళీలు: 96
👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
▪️ ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
▪️కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
👉వయస్సు : 11/06/2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
▪️ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు,
▪️దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
👉శాలరీ : నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380;
▪️ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు.
👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు.
▪️మిగిలిన అభ్యర్థులు రూ.100/- చెల్లించాలి.
👉దరఖాస్తుల ప్రారంభం:
మే 22, 2023
👉 దరఖాస్తులకు చివరితేదీ:
జూన్ 11, 2023
👉వెబ్సైట్ : www.indiapostgdsonline.gov.in