Type Here to Get Search Results !

బార్క్ లో 4,374 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...

👉బాబా అణు పరిశోధనా కేంద్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన పరిశోధనా కేంద్రం బార్క్..

👉ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ స్కీం అంటే స్టెపెండరీ ట్రైనీ కింద మిగిలిన అంటే 4,162 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉టెక్నికల్ ఆఫీసర్/ సి 181 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్/ బి 7 పోస్టులు, టెక్నీషియన్/ బి 24 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయనున్నారు.

👉శాలరీ : నెలకు రూ.56,100 వేతనం, ఎస్ఏకు రూ.35,400,టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 వేతనం చెల్లించనున్నారు.

👉కేటగిరీ-1 1,216 పోస్టులు, కేటగిరీ-2 2,946 పోస్టులను ట్రైనింగ్ స్కీం అంటే స్టెపెండరీ ట్రైనీ కింద భర్తీ చేయనున్నారు.

👉వీరికి నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000 వరకు వేతనం,

👉కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు వేతనం చెల్లించనున్నారు.

👉 పోస్టుల వివరాలు: కెమిస్ట్రీ, బయో-సైన్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, ఫిజిక్స్, డ్రిల్లింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, మైనింగ్ విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి.

👉అర్హత: పోస్టులను బట్టి పది నుంచి పన్నెండో తరగతి వరకు, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఎస్సీ విద్యార్హతగా నిర్ణయించారు.

👉వయస్సు : మే 22, 2023 నాటికి అభ్యర్థుల ఏజ్ విభాగాల వారీగా పేర్కొన్నారు. 
◾️టెక్నికల్ ఆఫీసర్కు 18 నుంచి 35 ఏళ్లు,
◾️సైంటిఫిక్ అసిస్టెంట్ లకు 18 నుంచి 30 ఏళ్లు,
◾️టెక్నీషియన్ కు 18 నుంచి 25 ఏళ్లు,
◾️ స్టెఫెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19 నుంచి 24 ఏళ్లు, ◾️స్టెఫెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: కేటగిరీలను బట్టి ఫీజుల్లో మార్పులు ఉన్నాయి. టీవోకు రూ.500లు, ఎస్ఏకు రూ.150లు, కేటగిరీ-1 పోస్టులకు రూ.150, టెక్నీషియన్కు రూ.100లు, కేటగిరీ-2 పోస్టులకు రూ.100లుగా నిర్ణయించారు. ఇక ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

👉 ఎంపిక విధానం: పోస్టులను బట్టి ప్రిలిమినరీ, అడ్వాన్స్డ్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్వ్యూ, ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◾️రాత పరీక్షను తెలుగు రాష్ట్రాల్లోని, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, అమరావతి, కరీంనగర్, హైదరాబాద్.

👉ప్రిలిమినరీ ఎగ్జామ్:
తొలి దశ ఎగ్జామ్ మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ◾️ఇందులో మ్యాథ్ నుంచి 20ప్రశ్నలు,
◾️సైన్స్ నుంచి 20 ప్రశ్నలు,
◾️జనరల్ అవేర్ నెస్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
◾️ప్రతీ కరెక్ట్ ఆన్సర్ కు 3 మార్కులను కేటాయించారు.
◾️అలాగే ప్రతీ రాంగ్ ఆన్సర్ కు ఓ నెగిటివ్ మార్క్ కేటాయించారు.
◾️ప్రిలిమనరీ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ టెస్టు నిర్వహిస్తారు.
◾️ఆ తర్వాత స్కిల్ టెస్టు నిర్వహిస్తారు.


Tags

Post a Comment

0 Comments